కెన్యా దేశంలో గరిస్సా విశ్వవిద్యాలయ కాలేజీపై నిన్న సోమాలియాకు చెందిన అల్-షబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 147మంది విద్యార్ధులు చనిపోగా మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం మారణాయుధాలతో విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన ప్రవేశ ద్వారంవద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించారు. ఆ తరువాత లోపల ఉన్న విద్యార్ధులు, అధ్యాపకులలో ముస్లిం మతస్థులను గుర్తించి వారిని బయటకు పంపించి మిగిలిన క్రీస్టియన్ విద్యార్ధులు, అధ్యాపకులను బందీలుగా పట్టుకొని వారిలో 147మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.
No comments:
Post a Comment