Friday, 3 April 2015

నేడు శ్రీ సిటీలో 11 పరిశ్రమలకు శంఖుస్థాపన

http://www.teluguone.com/news/content/andhra-pradesh-39-44778.html#.VR5zWtyUfVE

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో శ్రీసిటీలో ఏకంగా 11 దేశ, విదేశీ పరిశ్రమలకు శంఖుస్థాపన, మరో 9 పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. రూ. 1600 కోట్ల వ్యయంతో శ్రీసిటీలో నిర్మించిన పెప్సీ కంపెనీ, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేస్తారు. శ్రీసిటీలో నిర్మించబడిన కోల్గేట్ టూత్ బ్రష్షుల తయారీ కర్మాగారానికి కూడా ఆయన ఈరోజు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కర్మాగారంలో ఏడాదికి 220 మిలియన్ల టూత్ బ్రష్షులు ఉత్పత్తి అవుతాయి.

ఈ రోజు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయబోయే సంస్థలలో నాలుగయిదు సంస్థలు తప్ప మిగిలినవన్నీ విదేశీ సంస్థలే. దాదాపు రూ.1450 కోట్లు పెట్టుబడులతో ఈ సంస్థలు ఏర్పాటు చేయబడుతున్నాయి. త్వరలోనే జపాన్ దేశానికి చెందిన ఇసుజు ట్రక్కుల తయారీ సంస్థ కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేప్పట్టబోతోంది.

No comments:

Post a Comment