కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణా విషయంలో ఇంతవరకు వెనుక నుండి సలహాలు ఈయడమే తప్ప, ఎన్నడూ తెర ముందుకు వచ్చి నిర్ద్వందంగా తన అభిప్రాయం చెప్పలేదు. తాను అధికార పార్టీలో బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్నందునే మాట్లాడలేకపోతున్నానని ఆయన అనడం న్యాయమే. అయితే, ఆయన ఆ పదవిలో ఉనంతకాలం కూడా ఏమి మాట్లాడలేన్నపుడు, కేంద్రమంత్రిగా తన పరపతిని ఉపయోగించి కేంద్రాన్ని ఒప్పించలేనప్పుడు, ఆయన వలన తెలంగాణా కోరుకొంటున్నవారికి ఏమి ప్రయోజనం? ఆయన తెలంగాణాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కేంద్రమంత్రిగా తెలంగాణాపై మాట్లాడేందుకు తనకున్న పరిమితులు చెప్పుకొచ్చి, తన పరిస్థితిని అర్ధం చేసుకోమని ప్రజలను కోరడం నవ్వు తెప్పిస్తుంది.
No comments:
Post a Comment