Friday, 1 May 2015

సింహాచలానికి రాజయోగం



విశాఖ సమీపంలోని సింహాచలం ప్రాంతానికి రాజయోగం పట్టినట్టు అనిపిస్తోంది. రాష్ట్ర విభజన పుణ్యమా అని ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. సమైక్య రాష్ట్రంగా వున్న సమయంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. అందుకే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి అప్పులు మాత్రం మిగిలాయి. అయితే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్తులో జరగబోతున్న అభివృద్ధి అక్కడి ప్రజలలో నూతనోత్సాహం నింపుతోంది. ఆ ఆభివృద్ధిలో అగ్ర తాంబూలం అందుకునే దిశగా ఉత్తరాంధ్ర ప్రాంతం పయనిస్తోంది. విశాఖపట్టణం ఇప్పటికే సాఫ్ట్‌వేర్, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధి సాధించబోతుంది. విశాఖపట్నం సమీపంలోనే వున్న సింహాచలం ప్రాంతం కూడా ఇప్పుడు ఊహించని స్థాయి అభివృద్ధిని అందుకోబోతోంది. స్వామినారాయణ్ ట్రస్ట్ నిర్మించే అక్షర్‌ధామ్ దేవాలయాల గురించి అందరికీ తెలిసిందే. గుజరాత్‌లో ఒక దేవాలయం వుంది. ఢిల్లీలో మరో దేవాలయం వుంది. ఇప్పుడు సింహాచలంలో కూడా 

No comments:

Post a Comment