Wednesday, 15 April 2015

జైల్లో సిమీ ఉగ్రవాదుల నిరాహార దీక్ష


నల్గొండజిల్లాలో ఐఎస్ఐ ఏజెంట్, సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ లో హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అతన్ని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ చంచల్‌గూడలో ఉన్న పలువురు ఇస్లామిక్ ఉగ్రవాదులు నిరాహారదీక్షకు దిగారు. జైల్లో ఉన్న ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, అబిద్ హుస్సేన్, బిశ్వాక్, షకీల్‌లు నోటీసులు ఇచ్చి మరీ దీక్షకు దిగారని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. మరోవైపు వీళ్లు దీక్ష చేయడానికి ఉగ్రవాద నేతల నుంచి ఏమైనా సందేశాలు అందాయా? ఉగ్రవాదులను విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా ఆసమయంలో ఏమైనా సందేశాలు అందాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

For More At : http://www.teluguone.com/news/content/isi-terrorists-fasting-in-chanchalguda-jail-39-45181.html#.VS4nrtyUfVE

No comments:

Post a Comment