చిరంజీవి తనకున్న విశేష జనాధారణను చూసుకొనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలో ప్రవేశించారు. కానీ ఏ అభిమానుల అండతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అవుదామనుకొన్నారో వారినే ఎన్నికల సమయంలో విస్మరించడంతో ఆయన అభాసుపాలయ్యారు. ఆ తరువాత నుండి చేసినవన్నీ స్వయంకృతాపరాదాలే. కనీసం కేంద్రమంత్రిగా నిలద్రొక్కుకొన్నప్పుడయినా ఆయన మళ్ళీ తన అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! కానీ చేతులు కాలే వరకు కూడా ఆయన మేల్కొనలేదు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ఆంద్రప్రదేశ్ ప్రజలు కోపంతో రగిలిపోతున్నారనే సంగతిని గ్రహించకుండా లేదా గ్రహించనట్లుగా నటిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు.
No comments:
Post a Comment