అధికార తెరాస పార్టీ నేతలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం ఆ పార్టీనే ఆదర్శంగా తీసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెదేపా సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఇన్స్యూరెన్స్ పధకాన్ని జోడించడం ద్వారా రెండు రాష్ట్రాలలో కలిపి యాబై లక్షలమందికి పైగా కొత్త సభ్యులను పార్టీలోకి చేర్చుకోగలిగింది. దానికి వచ్చిన ఆ అనూహ్య స్పందన చూసి తెరాస పార్టీ కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయం కల్పించి మంచి ఫలితాలు రాబట్టగలిగింది. అందుకోసం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అదికారులకు నిన్న రూ. 4,64,21,200 రూపాయల చెక్కును అందచేశారు.
http://www.teluguone.com/news/content/trs-39-45066.html#.VSkLdNyUfVE
No comments:
Post a Comment