ఎర్రగడ్డలో ఉన్న మానసిక, ఛాతి వ్యాధుల ఆసుపత్రులను వేరే చోటికి తరలించి, అక్కడ కొత్తగా సచివాలయం నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం భావించింది. దానిని వ్యతిరేకిస్తూ ఇదివరకు హైకోర్టులో ఒక పిటిషనుపడింది. అటువంటి ప్రభుత్వ నిర్ణయాలలో తాము తల దూర్చబోమని హైకోర్టు స్పష్టం చేస్తూ ఆ పిటిషనుని కొట్టివేసింది. ఎర్రగడ్డ ఆసుపత్రులున్న ప్రాంగణంలో ఒక చారిత్రక భవనం ఉందని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, “మనం నివసిస్తున్న భూమి కూడా చాలా పురాతనమయినదే. అంత మాత్రాన్న భూమిని ముట్టుకోవద్దంటే కుదురుతుందా?” అని వితండవాదం చేసి వారి నోళ్ళు మూయించారు. కానీ అటువంటి వాదనలతో కోర్టులని ఒప్పించడం మాత్రం వీలుపడదని, ఆ భవనం తొలగింపుపై స్టే విధించడం ద్వారా హైకోర్టు స్పష్టం చేసింది.
No comments:
Post a Comment