మన రాష్ట్ర రాజకీయ నాయకులలో నీతి నిజాయితీలతో ఎక్కువగా కనెక్ట్ అయ్యుండేవారిలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒకరు. పాపం ఆయన నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండాలనుకొన్న కారణంగానే ఎన్నికలలో ఓడిపోయానని తరచూ చెప్పుకొంటుంటారు. అంతమాత్రాన్న ఆయన కవచ కుండలాల వంటి తన నీతి నిజాయితీలను విడిచిపెట్టేయలేదు. అటువంటి వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీ కుట్రపన్ని అన్యాయంగా సీబీఐ కేసులు బనాయించింది. కానీ తన మీద అన్యాయంగా కేసులు బనాయించిన కాంగ్రెస్ అధిష్టానం చలవతోనే ఆయన బెయిలు మీద జైలు నుండి బయటకు రాగలిగారని మీడియాలో అప్పుడెప్పుడో గుప్పుగుప్పున వార్తలు వస్తే ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా’ అని ఆయన ప్రత్యర్ధులు కూడా వంత పాడారు.
For More At http://www.teluguone.com/news/content/enforcement-directorate-37-44798.html#.VR50kdyUfVE
No comments:
Post a Comment