ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పిచ్చికుక్కల సీజన్ మళ్ళీ మొదలైంది. రెండేళ్ళ క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయి స్వైర విహారం చేసి వందలాది మంది మృతికి కారణం అయ్యాయి. వాటి ధాటికి మనుషులు కుక్కలను చూస్తేనే భయంతో వణికిపోయే పరిస్థితికి చేరుకున్నారు. ఏ ఆస్పత్రిలో బెడ్లు చూసినా పిచ్చికుక్కలు కరిచిన పేషెంట్లతో నిడిపోయి వుండేవి. ప్రతిరోజూ కనీసం ఇద్దరు ముగ్గురైనా పిచ్చికుక్కల బారిన పడి మరణించేవారు. పిచ్చికుక్కలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం పెద్ద గుణపాఠం నేర్చుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రం విభజన కావడం వల్లనో, మతిమరుపు వల్లనోగానీ, అధికారులు అప్పుడు నేర్చుకున్న గుణపాఠాన్ని మరచిపోయినట్టున్నారు. అందుకే మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పిచ్చికుక్కల సీజన్ మొదలైంది.
For More At : http://www.teluguone.com/news/content/mad-dogs-39-45304.html#.VTIv4NKeDGc
No comments:
Post a Comment