ప్రపంచంలో భారతదేశంతో సహా అనేక దేశాలు ఉగ్రవాదానికి బలవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ వంటి దేశాలు భయంకరమయిన విషసర్పాల వంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తునే ఉన్నాయి. పాము తన పిల్లలను తానే చంపి తిన్నట్లుగా వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు చివరికి వారి పిల్లలను, ప్రజలనే అతి కిరాతకంగా చంపుతున్నారు. అయినా పాక్ ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ నిర్వాకానికి భారత్ కూడా మూల్యం చెల్లించవలసిరావడం ప్రతీ భారతీయుడికి చాలా కష్టం అనిపిస్తుంది.
పాకిస్తాన్ నిర్వాకం ఎలా ఉన్నా రెండు నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూడా సరిగా అటువంటి నిర్వాకమే చేస్తూ భారత్ కు మరిన్ని కొత్త సమస్యలు, సవాళ్ళు, కష్టాలు తెచ్చిపెడుతున్నారిప్పుడు.
No comments:
Post a Comment