ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
* ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫిట్మెంట్తో కూడిన జీతాలను మే 1వ తేదీ నుంచి అందుకుంటారు.
* ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పరికరాలను 70 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించారు. కరువు పీడిత ప్రాంతల్లోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. వేరుశనగకు హెక్టారుకు 15,000, వరి, పత్తి, చెరకు, కూరగాయల పంటలకు 15,000, మొక్కజొన్నకు 12,500, మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, ఆరెంజ్ పంటలకు 20,000 నష్టపరిహారం ఇస్తారు. పప్పు ధాన్యాలు, సోయాబీన్ పంటలకు 10,000, అరటికి 25,000 పరిహారం చెల్లిస్తారు.
No comments:
Post a Comment