కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన 24x7గంటల నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టులను ప్రస్తుతం ఆంద్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో విజయవంతంగా అమలుచేస్తున్నారు. తీవ్ర విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతున్న తెలంగాణా రాష్ట్రానికి కూడా ఈ పధకాన్ని వర్తింపజేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రధాని మోడీని, కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసినప్పుడు కోరారు. ఆయన చేసిన అభ్యర్ధనను మన్నిస్తూ కేంద్ర ఇంధనశాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి ఆరోరా బృందాన్ని నిన్న హైదరాబాద్ పంపించారు.
For More At: http://www.teluguone.com/news/content/-center-39-44678.html#.VRqQhvyUfVE
No comments:
Post a Comment